వెయిట్‌ చేసినందుకు చాలా పెద్ద సక్సెస్‌ వచ్చింది: ‘విరూపాక్ష’ విజయంపై దర్శకుడు

by Disha Web Desk 9 |
వెయిట్‌ చేసినందుకు చాలా పెద్ద సక్సెస్‌ వచ్చింది: ‘విరూపాక్ష’ విజయంపై దర్శకుడు
X

దిశ, సినిమా: ‘విరూపాక్ష’ విజయంపై దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా వచ్చిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించగా ఏప్రిల్ 21న విడుదులై బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కార్తీక్.. ‘సినిమాలో దెయ్యం ఉండదు. అలా ఉన్నట్టు అనిపిస్తుంది. 2016, 2017లో ఓ పేపర్‌లో ఆర్టికల్‌ చదివా.

గుజరాత్‌లో ఓ మహిళ చేతబడి చేస్తుందనే అనుమానంతో చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడే ఇలాంటి కథ తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాను. ఆడియన్స్‌కు కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో సినిమాలో మర్డర్లు కూడా డిజైన్‌ చేశాం. క్లైమాక్స్‌లో ఆడియన్స్ థ్రిల్‌ అయిన విషయాలు డైరెక్టర్ సుకుమార్‌ చేసిన మార్పులే. ఈ సక్సెస్‌తో ఆయన చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు. టీమ్ అందరం సంతోషంగా ఉన్నాం’ అంటూ వివరించాడు.

Also Read..

నా క్రష్ సమంత.. మనసులో మాట బయటపెట్టిన మెగా మేనల్లుడు..

గోపీచంద్‌ Vs తేజ.. రసవత్తరంగా సాగిన ఇంటర్వ్యూ



Next Story

Most Viewed