భారీగా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఐదుగురు అగ్ర హీరోలతో మాస్టర్ ప్లాన్?

by Disha Web Desk 9 |
భారీగా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఐదుగురు అగ్ర హీరోలతో మాస్టర్ ప్లాన్?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంపై ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాను 10 భాగాలుగా తీస్తానని గతంలోనే చెప్పాడు. దీంతో ఆ సినిమాలో ఏ హీరోను ఎంపిక చేసుకుంటాడనేది ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే టాలీవుడ్ అగ్ర హీరోలైన.. ‘ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ఈ చిత్రంలో భాగం చేసేలా ఈయన ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

వాళ్లకు సంబంధించిన క్యారెక్టర్స్ కూడా ఆల్‌రెడీ డిసైడ్ చేసినట్లు నెట్టింట చర్చించుకుంటున్నారు. ప్రభాస్ కర్ణుడు, మహేష్ బాబు కృష్ణుడు, రామ్ చరణ్ అర్జునుడు, ఎన్టీఆర్ భీముడు పాత్రలకు సెట్ అవుతారని భావిస్తున్నారట. మరో హీరో అల్లు అర్జున్‌ను కూడా ఇందులో భాగం చేయాలని జక్కన చూస్తున్నట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నిజమైతే ఇండియన్ ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయమంటున్నారు నెటిజన్లు. ఏకంగా ఐదుగురు స్టార్లు ఒకే సినిమాలో నటిస్తే ఇక ఫ్యాన్స్‌కు పండగే.

Next Story