భార్యపై హీరో శర్వానంద్ స్పెషల్ పోస్ట్.. డబ్బు కోసం చేసుకున్నావంటూ నెటిజన్స్ కామెంట్స్

by Disha Web Desk 6 |
భార్యపై హీరో శర్వానంద్ స్పెషల్ పోస్ట్.. డబ్బు కోసం చేసుకున్నావంటూ నెటిజన్స్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ చిన్న హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. అయితే 2023 జనవరిలో బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి రక్షిత రెడ్డితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. రీసెంట్‌గా శర్వారంద్, రక్షిత జూన్ 3న జైపూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరై బాగా సందడి చేశారు. అయితే వీరి ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటి రక్షిత రూ. 100 కోట్ల కట్నం తెచ్చిందని.. ఆమె పేరు మీద బాగా ఆస్తులున్నాయని. వీరికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా, శర్వానంద్ తన భార్యతో దిగిన కొన్ని ఫొటోలను తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ లవ్ సింబల్‌ను జత చేశాడు. అది చూసిన నెటిజన్లు ‘ఆస్తుల పరంగా అన్ని ఉన్నా నీ భార్యకు అందం ఒక్కటి లేదు భయ్యా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ‘ఆమె డబ్బులు చూసి తొందరపడ్డావేమో’ అంటూ మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.

Also Read: టీనేజ్‌లోనే రొమాన్స్‌లో పీక్స్ చూస్తున్న ఆ హీరోయిన్ కూతురు.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో దొరికిపోయింది..

హీరో శర్వానంద్ రిసెప్షన్‌కు హాజరైన రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు.. ఫొటోస్



Next Story

Most Viewed