‘ఛీ ఛీ.. ఏం సినిమా అది.. తీశావులే బోడి ‘బాహుబలి’ కీరవాణి భార్య వ్యాఖ్యలు వైరల్..

by Disha Web Desk 6 |
‘ఛీ ఛీ.. ఏం సినిమా అది.. తీశావులే బోడి ‘బాహుబలి’ కీరవాణి భార్య వ్యాఖ్యలు వైరల్..
X

దిశ, వెబ్‌డెస్క్: న్యాచురల్ స్టార్ నాని, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ‘ఈగ’ సినిమా వచ్చి మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే. దీనికి సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందించి అందరినీ కట్టిపడేశారు. అప్పటి నుంచి కీరవాణి, రాజమౌళి రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా కలిసి ఉంటున్నారు. రాజమౌళి, కీరవాణి వారసులకు నాని తనదైన సాయం చేస్తూ ఉంటాడు. తాజాగా, కీరవాణి కొడుకు శ్రీ సింహా నటించిన ‘ఉస్తాద్’ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి రాజమౌళితో పాటు నాని కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఇక ఈ ఈవెంట్ లో నాని జక్కన్న, కీరవాణి కుటుంబాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఎన్ని రివ్యూలు ఇచ్చినా కూడా కీరవాణి భార్య వల్లి ఇచ్చే రివ్యూలు కోసం ఎదురు చూస్తాను. రాజమౌళి అయితే సినిమా బావుంటే బావుందని చెప్తాడు.. బాగోకపోతే అస్సలు ఫోన్ కూడా చేయడు. అదే రమా రాజమౌళి అయితే.. ఎలా ఉన్నా ఓకే అంటారు. కానీ, కీరవాణి భార్య వల్లి అయితే ఛీఛీ.. ఏం సినిమా అది.. అని ముఖం మీద చెప్పేస్తారు. నా విషయంలోనే కాదు బాహుబలి సినిమా రిలీజ్ అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాజమౌళి.. ఇంకోసారి సినిమాకు వెళ్దామా అని నేను అనగానే.. వల్లి గారు వెంటనే.. తీశావులే బోడి సినిమా.. మళ్లీ వెళ్తారా.. ? అని అనేశారు. అలాంటి నిజాయితీ మనుషులు ఉన్న కుటుంబం అది.

రాజమౌళి అండ్ టీమ్ కొత్త పాత అని సంబంధం లేకుండా అందరినీ ఎంకరేజ్ చేస్తుంటారు. నా సినిమాల విషయంలో వారెలా స్పందిస్తారో అని ఆలోచిస్తుంటాను. వాళ్లు చెప్పే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంటాను. సింహా విషయానికి వస్తే తను గ్రౌండ్ లెవల్ లోనే ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ల ఫ్యామిలీనే అలా ఉంటుంది. రాజమౌళి ఫ్యామిలీ లో అందరూ టెక్నీషియన్స్ యాక్టర్స్ లేరని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సింహా రూపంలో యాక్టర్ కూడా వచ్చేస్తున్నాడు. తను కూడా టాప్ పోజిషన్‌లో నిలుస్తాడు’’ అంటూ నాని చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed