అందరి ముందు ప్యాంటు విప్పమన్నారు.. ఎయిర్ లైన్స్‌పై నటి ట్వీట్ వైరల్

by Disha Web Desk 6 |
అందరి ముందు ప్యాంటు విప్పమన్నారు.. ఎయిర్ లైన్స్‌పై నటి ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: విమాన ప్రయాణం చేయడానికి వెళ్లిన హాస్య నటి క్రిస్సీ మేయర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనను అందరి ముందు ప్యాంటు విప్పాలని ఎయిర్ లైన్స్ సిబ్బంది తనను బలవంతం చేశారంటూ ఆరోపణలు చేయడం గమనార్హం. క్రిస్సీ మేయర్ తన స్నేహితురాలు కీను థాంప్సన్‌తో కలిసి అమెరికన్ ఎయిన్స్ లైన్స్‌లో ప్రయాణించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఫైట్ ఎక్కే ముందు ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఆమె ధరించిన ప్యాంట్ బాగోలేదని, మరోటి వేసుకోవాలని వారు చెప్పారట. దీంతో అందరి ముందే ప్యాంటు మార్చుకున్నాను అంటూ క్రిస్సీ ఎయిర్ లైన్స్ సిబ్బందిపై ఓ ట్వీట్ చేసింది. ‘‘ నేను ఫ్లైట్ ఎక్కే ముందు వారు నన్ను అపేసి. నా ప్యాంటు బాగోలేదని అందరి ముందే మార్చుకోమని బలవంతం చేశారు. ప్యాంటు మార్చుకున్న తర్వాత లోపలికి అనుమతించారు’’ అంటూ అమెరికన్ ఎయిర్ లైన్స్‌ను ట్యాగ్ చేసింది. అంతేకాకుండా ప్యాంటు మార్చుకోవడానికి ముందు ధరించిన దుస్తులతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

చికోటి ప్రవీణ్ థాయిలాండ్ ఎందుకు వెళ్లినట్టు.. థాయ్ మసాజ్ అంటే అంత పిచ్చి దేనికి?

Next Story

Most Viewed