నలుగురు హీరోయిన్లతో ఆ పని చేయడం చాలా భయంగా ఉంది: Akshay Kumar

by Disha Web Desk 6 |
నలుగురు హీరోయిన్లతో ఆ పని చేయడం చాలా భయంగా ఉంది: Akshay Kumar
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ప్రేక్షకుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షో ‘ది కపిల్ శర్మ షో’. ఇందులో ప్రముఖ యాంకర్ కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తాడు. ఎప్పటికప్పుడు పలువురి సెలబ్రిటీలను పిలిచి వీక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా, ఆదివారం ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, నోరా ఫతేహి, దిశా పటానీ, మౌని రాయ్, సోనమ్ బజ్వాలు కూడా పాల్గొన్నారు. ఈ ప్రోమోలో అక్షయ్ కుమార్ తనకు చాలా టెన్షన్‌గా ఉందని చెప్పారు. కపిల్ శర్మ ఎందుకని అడుగగా.. ఈ సారి ఎంటర్టైనర్స్ టూర్‌లో భాగంగా తాను నలుగురు హీరోయిన్లతో కలిసి ఫారిన్ టూర్‌కు వెళ్లబోతున్నట్లు తెలిపాడు.

అంతేకాకుండా నలుగురు హీరోయిన్లతో ఫారిన్ టూర్‌కు వెళ్లడం తనకు చాలా బాధగా ఉన్నట్లు ఇంట్లో నటించాలని, టూర్ నుంచి ఆనందంగా తిరిగి వచ్చినా తనకు ఇంకో ప్రోగ్రాం ఉండదంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అక్షర్ కుమార్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షో ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా అని అక్షయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అక్షయ్ కుమార్ నటించిన ‘సెల్ఫీ’ సినిమా ఫిబ్రవరి 24న విడుదల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.




Next Story

Most Viewed