'ఉగ్రం' ప్రీ-రిలీజ్ కు అతిథులుగా నలుగురు హీరోలు

by Disha Web Desk 1 |
ఉగ్రం ప్రీ-రిలీజ్ కు అతిథులుగా నలుగురు హీరోలు
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ అండ్ వర్సటైల్ హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఉగ్రం'. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని జే.ఆర్.సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు జరగనుంది. తాజా సమాచారం ప్రకారం.. అడివి శేష్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిఖిల్ సిద్ధార్థ ఈవెంట్‌కు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా జోడిగా నటిస్తుంది. మే 5, 2023 నుంచి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది మూవీని నిర్మించారు.

Next Story

Most Viewed