టాలీవుడ్‌లో నలుగురు యాక్టర్స్ కిడ్నాప్.. ఎవరు చేశారో తెలుసా? (వీడియో)

by Disha Web Desk 6 |
టాలీవుడ్‌లో నలుగురు యాక్టర్స్ కిడ్నాప్.. ఎవరు చేశారో తెలుసా? (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టీవీ షో డ్రామా జూనియర్స్ ప్రేక్షకుల్లో ఫుల్ ఆదరను అందుకుంది. ఈ షో జీ తెలుగులో ప్రసారమవుతోంది. తాజాగా, డ్రామా జూనియర్స్ సీజన్-6 ప్రోమో ఆసక్తికరంగా విడుదలైంది. అందులో హోస్ట్‌గా ప్రదీప్.. జడ్జెస్‌గా బాబుమోహన్, జయప్రద,శ్రీదేవి వచ్చారు. దీని ప్రోమోని వెరైటీగా టీవీలో వచ్చే బ్రేకింగ్స్‌లా డిజైన్ చేశారు. వీడియోలో ‘‘ బ్రేకింగ్ న్యూస్‌తో స్టార్ అయి అందరికి ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోలో వీళ్లను ఓ గదిలో కట్టేసి డ్రామా జూనియర్స్‌లో పార్టిసిపేట్ చేసే చిన్నారులు అంతా వచ్చి భయపెడుతూ ఉంటారు.

ప్రదీప్‌ను కుర్చీకి కట్టేసి ఒక అపరిచితుడు వేషంలో ఒక చిన్నారి వచ్చి నీకు ఏ శిక్ష కావాలో కోరుకో.. సూల దండనమా, కుంభీపాకమా, క్రిమి భోజనమా అని అడిగేసరికి మరో చిన్నారి లాయర్‌గా వచ్చి వదిలెయ్’’ అంటుంది. మరో గదిలో బందీగా ఉన్న నటి శ్రీదేవి దగ్గరకు వచ్చి ఒక చైల్డ్ కంటెస్టెంట్ యమధర్మ రాజు వేషంలో భయపెడతాడు. ఎవర్రా మీరంతా అని హీరోయిన్ అడుగుతుంది. మరో రూమ్‌లో ఉన్న నటుడు బాబు మెహన్ దగ్గరకు ఇద్దరు అమ్మాయిలు వచ్చి గొడవ పడుతుంటారు. అలాగే సీనియర్ హీరోయిన్ జయప్రద ఓ గదిలో మేకప్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ‘మూడు గంటలయ్యింది. ఎవరో తెలీదు నన్ను మేకప్ రూమ్‌లోకి తీసుకొచ్చి లాక్ చేశారు అంటుంది. ఆ తర్వాత అందరినీ చిన్నారులు రౌండప్ చేస్తారు. ఆ తర్వాత జడ్జెస్ డ్రామా జూనియర్స్ సీజన్-6 తెలుసుగా ఈ సారి ఫెర్మా‌ర్మెన్సులు బద్దలైపోతాయి’’ అంటూ చెప్పడంతో ప్రోమో పూర్తవుతుంది. కాగా,ఈ షో జూన్ 11న ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతుంది.

Read More... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్-కె’ సినిమాలో కమల్ హాసన్..!


Next Story

Most Viewed