ఓటీటీలోకి రాబోతున్న ఫరియా అబ్దుల్లా డార్క్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-09 05:14:10  IST  )

టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఫరియా అబ్ధుల్లా(Faria Abdullah) ‘జాతి రత్నాలు’ సినిమాలో చిట్టి పాత్రతో ఒక్కసారిగా స్టార్‌డమ్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఓటీటీలోకి రాబోతున్న ఫరియా అబ్దుల్లా డార్క్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఫరియా అబ్ధుల్లా(Faria Abdullah) ‘జాతి రత్నాలు’ సినిమాలో చిట్టి పాత్రతో ఒక్కసారిగా స్టార్‌డమ్ అందుకున్న సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఆ తర్వాత చేసిన సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో, ఆడియన్స్ మధ్య మాత్రం తన పాపులారిటీని నిలబెట్టుకుంటూ వస్తోంది. ఇక 2024లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కల్కి’లో కీలక పాత్రలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. దీంతో ఫరియా కెరీర్‌కు మరోసారి బలమైన బూస్ట్ లభించింది.

ఇక ఇటీవల ఆమె నటించిన డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘గుర్రం పాపిరెడ్డి’(Gurram Papireddy)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేష్ అగస్త్య(Naresh Agastya), బ్రహ్మానందం, యోగిబాబు(Yogibabu), రాజ్ కుమార్ కసిరెడ్డి(Raj Kumar Kasireddy), జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, ప్రభాస్ శ్రీను(Prabhas Srinu), జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ వంటి అనుభవజ్ఞులు కీలక పాత్రల్లో కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. డార్క్ కామెడీ జానర్‌లో కొత్తగా ప్రయత్నించినప్పటికీ, థియేట్రికల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

దీంతో నెలరోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో సినీ అభిమానులు ఖుష్ అవుతున్నారు. ‘గుర్రం పాపిరెడ్డి’ మూవీ జనవరి 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. దీనికి తోడు ‘‘జర భద్రం.. ఇది అంతా మోసం.. గుర్రం పాపిరెడ్డి వస్తున్నాడు’’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేయడంతో సినిమాపై మరోసారి చర్చ మొదలైంది. థియేటర్‌లో మిస్ అయిన ప్రేక్షకులు, అలాగే డార్క్ కామెడీ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారు ఈ సినిమాను ఓటీటీలో చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story