ఆస్తులు తనాఖా పెట్టిన kangana Ranaut

by Disha Web Desk 10 |
ఆస్తులు తనాఖా పెట్టిన kangana Ranaut
X

దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ 'ఎమర్జెన్సీ'ని అద్భుతంగా మలిచేందుకు ప్రతీ విషయాన్ని పరిగణలోకి తీసుకుని పనిచేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా కోసం తన రక్తాన్ని ధారపోసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా ఎమోషనల్ నోట్ షేర్ చేసింది క్వీన్. 'నేను ఈ రోజు నటిగా 'ఎమర్జెన్సీ'ని ముగించాను. నా జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం పూర్తయింది. ఆస్తులు తనాఖా పెట్టడం నుంచి తొలి షెడ్యూల్‌లోనే డెంగ్యూ నిర్ధారణ, ప్లేట్‌లెట్స్ పడిపోయినా చిత్రీకరణ కంటిన్యూ చేసే వరకు.. వ్యక్తిగతంగా తీవ్రమైన పరీక్ష ఎదుర్కొన్నా. అయినా సరే ఇవన్నీ ఎప్పుడు పంచుకోలేదు. ఎందుకంటే కొందరు నా ఫెయిల్యూర్‌ను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అలాంటి హ్యాపీనెస్ వారికి ఇవ్వదలుచుకోలేదు. కానీ ఒక్కటే జీవితం మీకు సక్సెస్‌ను అందిస్తే అదృష్టవంతులు. ఒకవేళ అది కాకపోతే ధన్యులు. ఎందుకుంటే ఇది మీ పునర్జన్మ సమయం అని గుర్తుంచుకోండి' అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : ప్రిన్సెస్ డయానా లాకెట్ సొంతం చేసుకున్న మోడల్.. తప్పని విమర్శలు

Next Story

Most Viewed