చేపలు తినండి.. ఐశ్వర్యరాయ్ లాంటి కళ్లను పొందండి: మంత్రి విజయ్‌కుమార్ గవిత్

by Disha Web Desk 9 |
చేపలు తినండి.. ఐశ్వర్యరాయ్ లాంటి కళ్లను పొందండి: మంత్రి విజయ్‌కుమార్ గవిత్
X

దిశ, సినిమా: మహారాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ తాజాగా ధులే జిల్లాలో మత్స్యకారుల సంఘంతో ఓ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రి గవిత్ చేపల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. ‘బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కళ్లు నిత్యం చేపలు తినడం వల్ల అంత అందంగా కనిపిస్తున్నాయి. చేపలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడమే ఆమె అద్భుతమైన కళ్లకు కారణం. చేపలను ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవాలి’ అని ఆమెను ఉదాహరణగా చెప్పడం విశేషం. దీంతో వెంటనే ఈ ప్రకటనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) శాసనసభ్యుడు అమోల్ మిత్కారీ స్పందిస్తూ ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కంటే గిరిజన సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది’ అని కోరారు.

Next Story

Most Viewed