‘దృశ్యం-3’ రిలీజ్ డేట్ ఫిక్స్..

by Mallepaka Hamsa |

పోలీసుల నుండి కాపాడుకోవడానికి చేసే ఆఖరి పోరాటం ఇందులో చూపించబోతున్నారు.

‘దృశ్యం-3’ రిలీజ్ డేట్ ఫిక్స్..
X

దిశ, సినిమా: ‘దృశ్యం’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ హీరోలుగా రీమేక్ అయ్యి అన్ని భాషల్లోనూ ప్రేక్షకులను మెపించింది. 2021లో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, దర్శకుడు జీతు జోసెఫ్ (Jeetu Joseph)మూడో భాగాన్ని సిద్ధం చేశారు. తాజాగా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. మోహన్ లాల్ తన సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విశేషమేమిటంటే, ఈ సిరీస్‌లో ఇదే చివరి భాగం.

క్లైమాక్స్ షాక్‌కు గురిచేసేలా ఉంటుంది..

జార్జికుట్టి తన కుటుంబాన్ని పోలీసుల నుండి కాపాడుకోవడానికి చేసే ఆఖరి పోరాటం ఇందులో చూపించబోతున్నారు. ఇప్పటికే హిందీలో అజయ్ దేవగన్ ‘దృశ్యం 3’ షూటింగ్ ప్రారంభమవ్వగా, తెలుగులో వెంకటేష్ కూడా ఈ ప్రాజెక్టును త్వరలో పట్టాలెక్కించబోతున్నారు. అన్ని భాషల క్లైమాక్స్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేసేలా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్‌తో పాటు మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ తమ పాత పాత్రల్లోనే అలరించబోతున్నారు. రెండవ భాగం ముగింపులో జార్జికుట్టి పోలీసుల కన్నుగప్పి తన ఇంటి కింద శవాన్ని పాతిపెట్టి దొరక్కుండా తప్పించుకుంటాడు. మరి మూడో భాగంలో పోలీసులు ఆ శవాన్ని వెలికితీస్తారా? లేదా జార్జికుట్టి మరో మాస్టర్ ప్లాన్‌తో అందరినీ బురిడీ కొట్టిస్తాడా? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఏప్రిల్ 2న థియేటర్లలో పడబోయే ఈ ‘దృశ్యం 3’తో జార్జికుట్టి కథకు ఒక పవర్‌ఫుల్ ముగింపు లభిస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story