అభిమానంతో మా కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టకండి.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో యశ్

by Dishafeatures1 |
అభిమానంతో మా కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టకండి.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో యశ్
X

దిశ, సినిమా: ప్రముఖ కన్నడ నటుడు యశ్ ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో చెప్పనక్కర్లేదు. ఇక స్టార్ హీరోల పుట్టిన రోజు అంటే అభిమానుల హడావుడి మామూలుగా ఉండదు. కాగా తాజాగా యష్ 38వ బర్త్ డే వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. యష్‌ బర్త్ డే బ్యానర్స్ ఏర్పాటు చేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు ఫ్యాన్స్ మృతి చెందారు. మృతి చెందిన వారు లక్ష్మేశ్వర్ తాలూకా, సురంగి గ్రామానికి చెందిన హనుమంత మజ్జురప్ప హరిజన్, మురళి నీలప్ప నిడివిమని, నవీన నీలప్ప గజిగా గుర్తించారు. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా తాజాగా మృతుల కుటుంబాలను పరామర్శించిన హీరో యష్.. వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఇందులో భాగంగా అక్కడ యశ్ మాట్లాడుతూ.. ‘ నాకు పుట్టినరోజు అంటే భయం వేస్తుంది. నిజం చెప్పాలంటే, నాపై నాకు అసహ్యం వేస్తుంది. మీరు ప్రేమ కురిపిస్తే చాలు. అదే నాకు నిజమైన పుట్టినరోజు.. ఈ బ్యానర్లు కట్టి అభిమానాన్ని చాటుకోవడం నాకు ఇష్టముండదు. వారికి ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబాలకు ఎవరు దిక్కు.? ఈ క్షణం నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బైక్‌పై ర్యాలీలు, బ్యానర్ లు కట్టడాలు అలాగే ఛేజింగ్‌లన్నింటినీ వదిలివేయండి. నాపై ప్రేమను చూపించాలి, మంచి పని చేయాలి, మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి అది చాలు. నన్ను ఎగతాళి చేసినా పట్టించుకోను, దూరంగా ఉంటాను. ఇప్పుడు నష్టపరిహారం ప్రకటించడం నాకు పెద్ద విషయం కాదు. నేను ఏదైనా మాట్లాడగలను.. వారి కుటుంబానికి ఏం చేయాలో అది చేస్తాను. ఎవరికి కోపం వచ్చినా పర్వాలేదు. ఈ రోజు నేను రావడానికి కారణం చనిపోయిన వారి తల్లిదండ్రులను గౌరవించడం. ఆ కుటుంబాలు ముగ్గురు బిడ్డలను కోల్పోయారు. మాపై అభిమానం కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టకండి. ప్రేమ, గౌరవం ఉంటే బాధ్యతాయుతంగా వ్యవహరించండి’ అని యశ్‌ అన్నారు.




Next Story

Most Viewed