- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మతపిచ్చితో దేశాన్ని వెనక్కి నెట్టకండి.. దుమారం రేపుతున్న రష్మీ పోస్ట్
యుద్ధాన్ని సమర్థించే వారిని దయచేసి ఇరాన్కు పంపాలని ఆమె ప్రధానిని కోరారు.

దిశ, సినిమా: పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను ఆందోళనకు దారితీస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలకు పాకడంతో అక్కడ నివసిస్తున్న వేలాది మంది భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో స్వదేశానికి రావాలనుకునే వారు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఈ భయానక వాతావరణంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ చేసిన వరుస పోస్టులు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రష్మీ (Rashmi Gautam)తన సోషల్ మీడియా వేదికగా దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అత్యంత ఘాటుగా స్పందించారు.
‘‘మన దేశం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలను గౌరవించింది. కానీ రాడికల్ (అతివాద) మనస్తత్వాన్ని మేము సహించము. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాప్తి చెందనివ్వం’’ అని రష్మీ స్పష్టం చేశారు. రాడికల్ ఆలోచనలతో ఉండి, యుద్ధాన్ని సమర్థించే వారిని దయచేసి ఇరాన్కు పంపాలని ఆమె ప్రధానిని కోరారు. అలాంటి వారు అక్కడికి వెళ్లి తమ సొంత ప్రజల కోసం పోరాడుకోవచ్చు అని అన్నారు. మన దేశంలో ఇప్పటికే పేదరికం, కుల సమస్యలు, నిరక్షరాస్యత వంటి అనేక అంతర్గత సమస్యలు ఉన్నాయని, వీటన్నిటికీ తోడు ఈ రాడికల్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు మతపిచ్చితో దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మన లక్ష్యం ఒక ప్రగతిశీల దేశంగా ఎదగడమే అని ఆమె గుర్తు చేశారు. రాడికల్ మనస్తత్వం ఉన్న దేశాల్లో ఆడపిల్లలకు 9 ఏళ్లకే పెళ్లిళ్లు చేస్తారని, కానీ తాను ఒక స్వతంత్ర దేశంలో ఉంటున్నందుకు గర్వపడుతున్నానని రష్మీ అన్నారు.
‘నేను పెళ్లి చేసుకోకుండా, పిల్లలు లేకుండా ఉన్నా కూడా నా దేశంలో పూర్తి గౌరవంతో, వ్యక్తిత్వంతో బతుకుతున్నాను’’ అని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు. రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకునేలా చేస్తున్నాయి. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. యుద్ధం వల్ల తలెత్తే పరిణామాల, మన దేశ భద్రతపై ఆమె వ్యక్తం చేసిన ఆందోళన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఆమె పోస్టులు సోెషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.






