- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముదిరిన వివాదం.. మోనాలిసాపై పరువు నష్టం దావా వేస్తానంటూ దర్శకుడు వార్నింగ్!
మోనాలిసా తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లిని వ్యతిరేకించారు. ఆ వివాహం చెల్లదు. కేవలం వ్యక్తిగత కక్షతోనే నాపై నిందలు వేస్తోంది.

దిశ, సినిమా: సోషల్ మీడియాలో కుంభమేళా ఫోటోషూట్తో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించిన అందాల భామ మోనాలిసా భోంస్లే, ఇప్పుడు ఒక సీరియస్ వివాదంతో వార్తల్లో నిలిచారు. తనను వెండితెరకు పరిచయం చేస్తున్న దర్శకుడు సనోజ్ మిశ్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, షూటింగ్ సెట్లో తన శరీరాన్ని పదే పదే తాకుతూ వేధించాడని ఆమె చేసిన ఆరోపణలు బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మోనాలిసా ఇటీవల కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ పెళ్లిని వ్యతిరేకించిన సనోజ్ మిశ్రాపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా, ఈ విషయంపై దర్శకుడు సనోజ్ మిశ్రా ఘాటుగా స్పందించారు.
మోనాలిసా చేసినవన్నీ పచ్చి అబద్ధాలని, కేవలం ఆమె పెళ్లిని తాను వ్యతిరేకించినందుకే ఇలాంటి బురదజల్లుతోందని ఆయన మండిపడ్డారు. "ఆమె తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లిని వ్యతిరేకించారు. ఆ వివాహం చెల్లదు. కేవలం వ్యక్తిగత కక్షతోనే నాపై నిందలు వేస్తోంది. ఆమె చెప్పేది నిజమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు" అని ఆయన సవాల్ విసిరారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గానూ మోనాలిసాపై ఒకటి రెండు రోజుల్లో పరువు నష్టం దావా వేయబోతున్నట్లు సనోజ్ మిశ్రా ప్రకటించారు. అంతేకాకుండా, ప్రస్తుతం ఆమెతో చేస్తున్న సినిమాను కూడా నిలిపివేస్తున్నట్లు, ఆ ప్రాజెక్ట్ గురించి తనకు ఏమాత్రం పట్టింపు లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.






