అనుపమ మాయలో పడిపోయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. అసలు ఏం జరిగింది అంటే..!

by Dishafeatures1 |
అనుపమ మాయలో పడిపోయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. అసలు ఏం జరిగింది అంటే..!
X

దిశ, సినిమా: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు. చేసిన మొదటి సినిమాతోనే ఒక ప్రయోగాత్మక సినిమా చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఏకంగా ‘హనుమాన్’ లో ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇక ప్రస్తుతం మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడట ప్రశాంత్ వర్మ. ఆ వివరాల్లోకి వెళ్లితే..

‘హనుమాన్ 2’ రాయడం కంటే ముందే ప్రశాంత్ వర్మ ఏకంగా ఐదుగురు హీరోయిన్స్‌తో ‘ఆక్టోపస్’ అనే ఓ లేడీస్ స్పెషల్ మూవీ మొదలుపెట్టాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ది మెయిన్ లీడ్ రోల్ అని తెలుస్తోంది. అయితే ఎందుకు ఆగిందో తెలియదు కానీ సుమారు 65 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. కాగా ఇప్పుడు మిగతా షూటింగ్ జరిపి ‘హనుమాన్ 2’ సినిమా కంటే ముందు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడు.

Read More..

ఆమె వీధుల్లో పిచ్చిదానిలా తిరిగేది.. సీనియర్ నటి పై శ్రీలక్ష్మి షాకింగ్ కామెంట్స్..


Next Story

Most Viewed