తిరుమల కొండపై కృతిసనన్‌కు ఔం రౌత్ ముద్దులు.. వివాదంలో ఆదిపురుష్ టీమ్!

by Disha Web Desk 19 |
తిరుమల కొండపై కృతిసనన్‌కు ఔం రౌత్ ముద్దులు.. వివాదంలో ఆదిపురుష్ టీమ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతిసనన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తిరుమల కొండపై వారు వ్యవహరించిన తీరుపై హిందూ ధార్మిక సంఘాలు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చి ఇవేం పిచ్చి పనులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆది పురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిన్న తిరుపతికి వచ్చిన చిత్ర బృందం బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం నుంచి వెళ్తున్న క్రమంలో కృతిసనన్ దర్శకుడు ఓం రౌత్‌కు బై చెప్పగానే, అతను ఆమెకు హగ్ ఇచ్చి బుగ్గపై ముద్దు పెట్టాడు.

ఇదంతా అక్కడ ఉన్న వారు వీడియో తీశారు.ఆ వీడియో వైరల్‌గా మారింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన డైరెక్టర్, హీరోయిన్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ నేత భాను ప్రకాష్ ఫైర్ అయ్యారు. స్వామివారి దర్శనానికి వచ్చి ఇవేం వెక్కిలి చేష్టలు అంటూ మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇదేం షూటింగ్ స్పాట్ కాదు.. పిక్నిక్ స్పాట్ కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడుగా ప్రవర్తించిన వీరికి టీటీడీ నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోలపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.

సీతమ్మ పాత్రధారితో ఓంరౌత్ ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎలా వ్యవహరించాలో సంప్రదాయం తెలియదా? రామచరితం తెరకెక్కించిన వారికి ఇదికూడా తెలియదా అంటూ మండిపడుతున్నారు. కాగా గతంలో హీరోయిన్ నయనతార సైతం తిరుమల కొండపై వివాదాస్పదంగా వ్యవహరించారు. ఆమె పెళ్లి తర్వాత తన భర్త విఘ్నేష్‌తో కలిసి చెప్పులు ధరించి తిరుమల వీధుల్లో తిరిగారు. నిషేధం ఉన్న ప్రాంతంలో ఫోటో షూట్ చేశారు. అది కాస్త వివాదాస్పదం కావడంతో నయనతార అప్పట్లో క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా ఆదిపురుష్ టీమ్‌పై విమర్శలు ఎంత వరకు వెళ్తాయో చూడాలి మరి.

Also Read..

Adipurush :ప్రభాస్ ‘ఆదిపురుష్’ విజయం అందుకున్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనం



Next Story

Most Viewed