ఆ విషయంలో డైరెక్టర్ అట్లీ నన్ను మోసం చేశాడు.. ప్రియమణి కామెంట్స్ వైరల్

by Disha Web Desk 6 |
ఆ విషయంలో డైరెక్టర్ అట్లీ నన్ను మోసం చేశాడు.. ప్రియమణి కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించి ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను తెచ్చుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొద్ది రోజులు సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస చిత్రాల్లో పలు పాత్రల్లో మెరుస్తుంది. ఈ అమ్మడు జవాన్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.

తాజాగా, ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ జవాన్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఏదో క్యామియో పాత్ర అయి ఉంటుందని భావించాను. అయితే షారుఖ్ ఖాన్ టీంలో ఒకరిగా ముఖ్యపాత్ర అని తెలియగానే చాలా సంతోషించాను. అట్లీ దర్శకుడు అని చెప్పగానే నటించడానికి ఒకే చేశాను. ఆ తర్వాత ఒకసారి అట్లీ కూడా జూమ్ కాల్‌లో మాట్లాడారు. అయితే నేను జవాన్‌లో నటించడానికి ఒప్పుకోగానే ఏదో ఐటమ్ సాంగ్‌‌లో కనిపిస్తానని ప్రచారం జరిగింది. వాటిని నేను పట్టించుకోలేదు. డైరెక్టర్ అట్లీ నన్ను చాలా ఏమార్చారు. జవాన్ చిత్రంలో తమిళ వర్షన్‌లో నటుడు విజయ్ గెస్ట్ రోల్‌లో నటించనున్నారని, అదే విధంగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఇదే విషయం గురించి నేను డైరెక్టర్ అట్లీని అడిగితే నటిస్తున్నారని అన్నారు. కానీ నిజానికి వాళ్లు జవాన్ సినిమాలో నటించలేదు. చివరివరకూ అట్లీ నన్ను నటిస్తారని చెప్తూ ఏమార్చుతూ వచ్చి మోసం చేశారు’’ అంటూ చెప్పుకొచ్చింది.

For More News about Bigg Boss Telugu Season 7


Next Story