ధనుష్-శేఖర్ కమ్ముల మూవీలో హీరోయిన్ ఫిక్స్

by Disha Web Desk 7 |
ధనుష్-శేఖర్ కమ్ముల మూవీలో హీరోయిన్ ఫిక్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో క్లాస్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు శేఖర్ కమ్ముల. అందుకే ఆయన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ఇక తాజాగా శేఖర్ కమ్ముల ఇప్పుడు నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఒక సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా రోజులు అవుతున్నప్పటికి ఇంత వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు.

ఇక తాజాగా ఈ మూవీ షూట్ గురించి కొత్త అప్‌డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మొదలు పెట్టడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అదికూడా ముంబై తదితర ప్రాంతాల్లో స్టార్ట్ చేయనున్నారట. అంతేకాదు ప్రజంట్ ‘D51’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా ఫిక్స్ అయింది. ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా శేఖర్ కమ్ముల ప్లాన్ చేసిన ఈ సినిమాను ఎమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారు LLP బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Read More..

ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక చెంపగిల్లి, ముద్దు పెట్టిన అభిమాని


Next Story