పుష్ప-2 చిత్ర బృందానికి షాక్.. ఆ సీన్ లీక్ చేసిన DSP

by Disha Web Desk 9 |
పుష్ప-2 చిత్ర బృందానికి షాక్.. ఆ సీన్ లీక్ చేసిన DSP
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రీసెంట్‌గా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఈ చిత్ర ప్రకటన సమయంలో సుకుమార్‌కు పాన్ ఇండియా ఆలోచనే లేదు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక రెండు భాగాలుగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కేవలం బాలీవుడ్‌లోనే ఈ మూవీ వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. మొత్తంగా పుష్ప రూ. 360 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే దర్శకుడు సుకుమార్ పుష్పకు సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. పార్ట్ -2 కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ బడ్జెట్ రూ. 350 కోట్ల వరకూ ఉంటుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ గురించి కీలక విషయాలు లీక్ చేశాడు. ‘‘సినిమా స్క్రీన్ ప్లే ఉత్కంఠ రేపుతుంది. ఇక జాతర నేపథ్యంలో గంగమ్మ అమ్మవారి గెటప్‌లో లో బన్నీతో తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని తెలిపారు. ఇప్పటికే అల్లు అర్జున్ గంగమ్మ గెటప్‌ ఫుల్ వైరలైంది. భారీ రెస్పాన్స్ దక్కింది. ఈ అవతారంలో భారీ యాక్షన్ సీన్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ బన్నీ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది(2024) ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

Next Story

Most Viewed