- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. న్యూమోనియాతో బాలీవుడ్ నటుడు మృతి
గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒకరి మరణవార్తను మర్చిపోకముందే మరొకరు మరణించడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దిగ్గజ నటుడు కోట శ్రీనివాస రావు మరణం నుంచి ఇంకా కోలుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి బి. సరోజాదేవి (87) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అలాగే స్టంట్ మ్యాన్ మోహన రాజు షూటింగ్ జరుగుతుండగా.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కారు బోల్తా స్టంట్ చేస్తుండగా.. గుండెపోటుతో అక్కడిక్కడే మరణించాడు. తాజాగా, మరో నటుడు కన్నుమూశారు. బాలీవుడ్ నిర్మాత, నటుడు ధీరజ్ కుమార్ (79) (Dheeraj Kumar)తుదిశ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా నిమోనియాతో బాధపడుతూ ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వెంటి లేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో నేడు కన్నుమూశారు.
కుమార్ సన్నిహితుడు అజయ్ శుక్లా(Ajay Shukla)ఈ విషయాన్ని ప్రకటించారు. "ఈ రోజు ఉదయం 11:00 గంటలకు కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో న్యుమోనియా కారణంగా ఆయన మరణించారు. కుమార్ అంత్యక్రియలు బుధవారం పవన్ హన్స్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు శుక్లా తెలిపారు. ఇక ధీరజ్ మరణ వార్త గురించి తెలుసుకున్న నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.






