''నాన్న ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు''.. మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్

by Disha Web Desk 19 |
నాన్న ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు.. మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ ఈ నెల 15‌వ తేదీన అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ హైదరాబాద్‌లో సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ కార్యక్రమాన్ని ఘట్టమనేని కుటుంబ సభ్యులు నిర్వహించారు. జెఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరై.. అక్కడే ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు.

సినీ ప్రముఖుల కోసం ఎన్‌ కన్వెన్షన్‌, అభిమానుల కోసం జెఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కృష్ణ కొడుకు, స్టార్ హీరో మహేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ప్రిన్స్ మాట్లాడుతూ.. ''నాన్న గారు నాకు చాలా ఇచ్చారు. నాన్న గారు ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం. ఆయనకి ఎప్పుడూ రుణపడి వుంటాను. నాన్న గారు ఎల్లప్పుడూ నా గుండెల్లో వుంటారు. మీ గుండెల్లో వుంటారు. మన మధ్యే ఉంటారు'' అని ఎమోషనల్ అయ్యాడు. ఇక, ఈ కార్యక్రమంలో 5వేల మంది అభిమానులకు.. 32 రకాల వంటకాలతో విందు ఏర్పాట్లు చేశారు.


మాజీ భర్తపై సమంత షాకింగ్ కామెంట్స్.. అంత ప్రేమ ఉందా అంటూ కామెంట్స్



Next Story

Most Viewed