వెంకటేష్‌కు తప్ప మరెవరికి మరదలుగా ఉండలేకపోయా.. కలర్స్ స్వాతి

by Disha Web Desk 10 |
వెంకటేష్‌కు తప్ప మరెవరికి మరదలుగా ఉండలేకపోయా.. కలర్స్ స్వాతి
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో తనపై వచ్చే రూమర్స్‌పై కలర్స్ స్వాతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్న ఆమె.. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాలను షేర్ చేసుకుంది. ‘కెరీర్ ఆరంభంలో చాలా స్ట్రగుల్ అయ్యాను. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రంలో క్యారెక్టర్ హిట్ కావడంతో అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి. అయితే మరదలు వంటి సైడ్ క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేక వదిలేశాను. దీంతో అందరూ నా పని అయిపోయిందన్నారు. కానీ ‘కార్తికేయ’, ‘స్వామిరారా’తో మళ్లీ నా గ్రాఫ్ పెరిగినందుకు సంతోషంగా అనిపించింది. అయితే ‘డేంజర్’ చేసినపుడు నాపై చాలా రకాల రూమర్స్ వచ్చాయి. కాస్త ఆందోళన చెందినప్పటికీ.. తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశా. కాలక్రమంలో వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More: శ్రీజ విడాకులపై ఫస్ట్ టైమ్ స్పందించిన చిరు.. ఏమన్నాడంటే..


Next Story

Most Viewed