పూల వర్షం కురిపిస్తూనే గుడ్లతో దాడి చేశారు: చిరు

by Disha Web Desk 13 |
పూల వర్షం కురిపిస్తూనే గుడ్లతో దాడి చేశారు: చిరు
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో టాక్ షోలు చాలా ఫేమస్ అవుతున్నాయి. ముందుగా బుల్లితెరపై 'కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' అంటూ ప్రదీప్ యాంకర్‌గా చేసిన ఇలాంటి షోలను ఇప్పుడు మూవీ స్టార్‌లు చేస్తున్నారు. బాలయ్య, మంచు లక్ష్మి, రానా, పలు షోలతో అకట్టుకున్నప్పటికీ ఇప్పుడు పాప్ సింగర్ స్మిత కొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 'నిజం విత్ స్మిత' అనే టైటిల్‌తో నిజాన్ని నిర్భయంగా బయట పెడతాను అంటుంది స్మిత. ఈ షో ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్‌లో ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానుంది.

ఇక ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. రీసెంట్‌గా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే కాలేజీ టైంలో చిరు క్రష్ గురించి, అలాగే ఒక కామన్ మ్యాన్‌గా వచ్చి చిరంజీవిగా ఎదిగే పరిస్థితి, జరిగిన అవమానాలు గురించి స్మిత ప్రశ్నించారు. 'అప్పటి వరకు పూల వర్షం కురిపించి, కాస్త ముందుకు వెళ్లగానే గుడ్లు విసిరారు. సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో కులం ఏమిటని అడిగేవారు' అని చెప్పారు. మొత్తానికి సస్పెన్స్‌తోనే ప్రోమోను కట్ చేశారు.

Also Read...

ఆసక్తిరేకెత్తిస్తున్న ధనుష్ 'సార్' మూవీ ట్రైలర్..!

Next Story

Most Viewed