Adipurush : ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ ఖరారు.. ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ టైం!

by Disha Web Desk 6 |
Adipurush :  ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ ఖరారు.. ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ టైం!
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జూన్ 6న నిర్వహించాలని మేకర్స్ భారీగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. తాజాగా, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా చిన్న జీయర్ స్వామి విచ్చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దీంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిన్న జీయర్ స్వామి సారి సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు రావడం ఇదే మొదటి సారి కావడంతో ఈవెంట్‌పై భారీ హైప్ క్రియోట్ అవుతోంది. ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.

Also Read: Bollywood: రోడ్డు మీద డ్రమ్స్ వాయిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

యాంకర్ సుమ పని అయిపోయినట్లేనా?


Next Story