- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పబ్లిసిటీ కోసమే విడాకుల డ్రామా.. నటిపై నెటిజన్లు ఫైర్
దిశ, సినిమా: టెలివిజన్ నటి చారు అసోపా.. భర్త రాజీవ్ సేన్తో విడాకుల ట్రోలింగ్పై రియాక్ట్ అయింది. ఇటీవల రాజీవ్తో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిన నటి.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. అయితే ఇన్నాళ్లుగా డివోర్స్ తీసుకుంటున్నట్లు చెప్పి ఇప్పుడు ఎందుకు కాదంటున్నావని ఫైర్ అయిన ఫ్యాన్స్.. పబ్లిసిటీ కోసమే డ్రామా లాడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమపై వెల్లువెత్తుతున్న విమర్శలపై మరోసారి స్పందించిన ఆమె.. కుమార్తె 'జియానా' పుట్టిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించామని, కోర్టు విచారణకు ముందు రోజు రాజీవ్తో సమస్యల గురించి కూర్చుని మాట్లాడి పరిష్కరించుకున్నట్లు తెలిపింది.
అంతేకాదు గణేశుడు తమను కలిసే ఉండమని కోరుకున్నాడన్న అసోపా.. కూతురు కోసం తమ వివాహం బంధాన్ని కొనసాగిస్తామని చెప్పింది. 'నేను ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మీరు దీన్ని పబ్లిసిటీ స్టంట్ అని ఎందుకు అంటున్నారో నాకు తెలియదు? మా నిర్ణయం గురించి మా న్యాయవాదులకు చెప్పినప్పుడు.. మమ్మల్ని కలిసే ఉండమంటూ మద్దతుగా నిలిచారు. దయచేసి మా పట్ల దయగా ఉండండి. ఏదైనా చెప్పే ముందు కాస్త ఆలోచించండి' అని కోరింది.