పూరి జగన్నాథ్ కోసం అర్థరాత్రి వరకు పడుకోకుండా ఉన్న చార్మి.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 9 |
పూరి జగన్నాథ్ కోసం అర్థరాత్రి వరకు పడుకోకుండా ఉన్న చార్మి.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి.. స్టార్ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది నటి చార్మి. ప్రస్తుతం ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో నిర్మాతగా మారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాను తెరకెక్కించారు. కానీ, ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. పైగా ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్‌కు, చార్మికి మధ్య ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపించాయి. కానీ, వీరిద్దరు ఆ రూమర్స్ ఏమి పట్టించుకోకుండా సినిమాలు నిర్మిస్తూ ముందుకు వెళ్తున్నారు. కాగా నేడు పూరి జగన్నాథ్ 57వ బర్త్డే సందర్భంగా ఈ దర్శకుడి ప్రొడక్షన్ పార్ట్‌నర్ అయిన చార్మి అర్థరాత్రి బర్త్ డే విషెస్ చెబుతూ నెట్టింట పోస్ట్ పెట్టింది. పూరి కేక్ కట్ చేస్తున్న పిక్స్ కూడా షేర్ చేసింది. దీనికి తోడు ‘హ్యాపీ బర్త్ డే పూరి సర్ అని రాసి ఉన్న కేక్స్ ముందు పూరి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ఇవి శాశ్వతమైన సెలెబ్రేషన్స్ అంటూ కామెంట్ పెట్టింది. దీంతో నెటిజన్లు వీరి మధ్యనున్న రిలేషన్ నిజమో అంటూ, ఇప్పుడు జనాలకు క్లారిటీ వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed