సీక్రెట్ రివిల్ చేసిన జాన్వీ.. ఆమె ధరించిన నెక్లెస్‌లో ఎవరి పేరు ఉందో తెలుసా..?

by Disha Web Desk 20 |
సీక్రెట్ రివిల్ చేసిన జాన్వీ.. ఆమె ధరించిన నెక్లెస్‌లో ఎవరి పేరు ఉందో తెలుసా..?
X

దిశ, సినిమా : మత్తెకించే కళ్లతో, కుర్రకారు మనసులను ఇట్టే దోచేసే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు, వ్యాపారవేత్త శిఖర్ పహాడియాతో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వచ్చాయి. అయితే వారు ఇప్పటివరకు వారి రిలేషన్ గురించి ఎక్కడ రివీల్ చేయలేదు. కానీ మంగళవారం జరిగిన ఓ ఈవెంట్ లో జాన్వి తన బాయ్ ఫ్రెండ్ పేరును రివీల్ చేసిందనే అనుకోవాలి.

మంగళవారం రాత్రి తండ్రి బోనీకపూర్ ప్రొడక్షన్ హౌస్‌లో నిర్మించిన 'మైదాన్' సినిమా ప్రదర్శనకు జాన్వీ కపూర్ హాజరయ్యారు. ఈ పార్టీలో ఆమె కస్టమైజ్ చేసిన నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ నెక్లెస్ లో ఆమె ప్రియుడు శిఖర్ పహాడియా పేరు ఉండడం అందరినీ మెస్మరైజ్ చేసింది. శిఖర్ ను జాన్వీ ముద్దుగా 'శిఖు' అని పిలుస్తుంది. ఇది చూసిన అభిమానులు వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి కన్ఫామ్ చేసుకన్నారనే చెప్పవచ్చు.

27 ఏళ్ల జాన్వీ కపూర్ గతేడాది కరణ్ జోహార్ చేసిన చాట్ షో 'కాఫీ విత్ కరణ్'లో కనిపించింది. ఈ షోలో కరణ్ తన మొబైల్ స్పీడ్ డయల్‌లో ఎవరి నంబర్ సేవ్ అయిందని జాన్వీని అడగ్గా 'శిఖూ...' అంటూ నోటి నుంచి వస్తూ నవ్వుతూ సైలెంట్ అయిపోయింది.



Next Story

Most Viewed