Priyanka: లాస్ ఏంజెలెస్ నుంచి హైదరాబాదుకు చేరుకున్న బాలీవుడ్ బ్యూటీ.. జక్కన్న ప్రాజెక్ట్ కోసమేనా?

by Kodari Anjali |

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)తెరకెక్కిస్తోన్న భారీ ప్రాజెక్టు ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB)కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Priyanka: లాస్ ఏంజెలెస్ నుంచి హైదరాబాదుకు చేరుకున్న బాలీవుడ్ బ్యూటీ.. జక్కన్న ప్రాజెక్ట్ కోసమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)తెరకెక్కిస్తోన్న భారీ ప్రాజెక్టు ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB)కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సెట్స్ పైకి ఎప్పుడెప్పుడు వెళ్లుందా ? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu)కథానాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)తెరకెక్కిస్తోన్న భారీ ప్రాజెక్టు ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB)కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Bollywood beauty Priyanka Chopra) లాస్ ఏంజెలెస్ నుంచి హైదరాబాదుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రియాక చోప్రా విమానాశ్రయంలో కనిపించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు.. ప్రియాంక చోప్రా హైదరాబాదుకు రావడానికి కారణం సూపర్ స్టార్ అండ్ జక్కన్న ప్రాజెక్ట్ కోసమేనా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతిత్వరలోనే చిత్రీకరణపై అప్డేట్ ఇవ్వనున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇక రీసెంట్‌గానే హైదరాబాదులో మూవీ టీమ్ పూజా కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ పై. క. ఎల్. నారాయణ నిర్మించనున్న ఈ మూవీ‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది.

Next Story