‘భోళా శంకర్’ వివాదం.. మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించిన నిర్మాత

by Disha Web Desk 6 |
‘భోళా శంకర్’ వివాదం.. మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించిన నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం ఆగస్టు 11న విడుదలై ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవికి నిర్మాత అనిల్ సుంకర ఇల్లు ఆస్తులు అమ్మి భారీగా పారితోషికం ఇచ్చినట్లు ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ స్పందించ‌గా తాజాగా, నిర్మాత అనిల్ సుంక‌ర సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘‘పుకార్లు అనేవి కొంతమంది వ్యక్తులకు క్రూరమైన వినోదాన్ని పంచ‌వ‌చ్చు. అయితే.. ఎంతో కాలం కష్టపడి పైకి వ‌చ్చిన వారి ప్రతిష్టను దెబ్బతీయడం అనేది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది తీవ్రమైన నేరం. ఇలాంటి రూమ‌ర్ల వ‌ల్ల వారి కుటుంబాలు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళ‌న‌కు గురి అవుతుంటాయి. ఇక నాకు, చిరంజీవికి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని వ‌చ్చిన వార్తల్లో నిజం లేదు. ఆయ‌న పూర్తిగా మ‌ద్దతు ఇచ్చారు. సినిమాల ప‌రంగానే కాదు వ్యక్తిగతంగానూ మా ఇద్దరి మ‌ధ్య చాలా మంచి స్నేహం ఉంది. వాస్తవాలను క‌ప్పి పెట్టి విద్వేష‌పూరిత వార్తల‌ను దయచేసి ప్రసారం చేయ‌వ‌ద్దు. నకిలీ వార్తలను సృష్టించడం కొంతమందికి సాధారణ వినోదంగా ఉండవచ్చు, కానీ అందులో భాగ‌స్వాములై ఉన్న వ్యక్తుల‌కు చిక్కులను క‌లిగిస్తుంది. ప్రస్తుత ప‌రిస్థితుల్లో నాకు అండ‌గా నిలిచిన ప‌రిశ్రమ‌లోని నా శ్రేయోభిలాషులందరికీ ధ‌న్యవాదాలు. మీ అంద‌రి ఆశీస్సులతో తిరిగి బలంగా రావాలని కోరుకుంటున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు.

Read More: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల బ్యూటీఫుల్ పిక్ వైరల్


Next Story