ప్రధాని మోడీ సభలో కాలి మీద కాలు వేసుకున్న బాలయ్య.. తిట్టిపోస్తున్న జనాలు..!

by Disha Web Desk 9 |
ప్రధాని మోడీ సభలో కాలి మీద కాలు వేసుకున్న బాలయ్య.. తిట్టిపోస్తున్న జనాలు..!
X

దిశ, సినిమా: టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజాగళం పేరుతో పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట బొప్పూడిలో ఇటీవల భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఇదే తొలి సభ కావడంతో మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాని మోడీ సైతం ఈ సభకు హాజరై ప్రసగించారు. అయితే ఈ సభలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రధాని హోదాకు, మోడీ వయస్సుకు బాలయ్య గౌరవం ఇవ్వాల్సి ఉందని, బాలయ్య కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఇదేమి మొదటిసారి కాదని గతంలో కూడా ఈ హీరో చాలా సందర్భాల్లో ఇదే విధంగా చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య రూటే వేరు, తనకు నచ్చిన విధంగా ఉంటాడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఈ కామెంట్లను కొట్టిపారేస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి.. ఏపీ ఎలక్షన్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం మళ్లీ షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అలాగే అఖండ-2 టైటిల్ తో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం.

Read More..

పిఠాపురం నుండే AP దశ మారుస్తా: పోటీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు



Next Story

Most Viewed