మల్టీఫ్లెక్స్‌లో అయోధ్యరాముడి పండుగ.. టికెట్ ధర ఎంత అంటే?

by Disha Web Desk 8 |
మల్టీఫ్లెక్స్‌లో అయోధ్యరాముడి పండుగ.. టికెట్ ధర ఎంత అంటే?
X

దిశ, సినిమా : కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న అతి పెద్దపండుగ అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం. అయోధ్యలో జనవరి22న బాలరాముడి విగ్రహం ప్రతిష్టించనున్న విషయం తెలిసిందే. దీంతో రామయ్య పండుగను చూడనికీ లక్షలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇప్పటికీ రాజకీయనాయకులకు, సినీ ప్రముఖులకు అయోధ్యకు ఆహ్వానం అందింది.

అయితే అయోధ్యకు వెళ్లలేని వారు మొబల్స్, టీవీల్లో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను చూడటాని రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మల్టీ‌ప్లెక్స్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా అయోధ్య రాముడి పండగను చూసే అవకాశం కల్పిస్తున్నాయి. దేశంలోని 70 ప్రధాన నగరాల్లోని 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అయోధ్య రాముడి పండగను ప్రత్యక్ష ప్రసారం చేసందుకు పీవీఆర్‌, ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి. దీనికి టికెట్ ధర 100 రూపాయలు మాత్రమే, అంతే కాకుండా కూల్‌ డ్రింక్స్‌, పాప్‌కార్న్ కాంబో కూడా ఉంటుంది.

Next Story