100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన అశ్విన్ 'Hidimbha'

by Disha Web Desk 10 |
100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన అశ్విన్ Hidimbha
X

దిశ,వెబ్ డెస్క్: అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో యంగ్ హీరో అశ్విన్ బాబు నటించిన సినిమా 'హిడింభ'. ఈ సినిమా జూలై 20 న విడుదల అయింది. అశ్విన్ కు జోడిగా నందితా శ్వేత నటిచింది. సుభలేఖ సుధాకర్ ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషించారు. వికాస్ బాదిసా సంగీతం అందించారు. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఓటిటి ప్లాట్ఫారం ఆహా సొంతం చేసుకున్న విషయం మనందరికి తెలిసిందే. 'హిడింభ' థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసి ఆగస్ట్ 10న ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్లాటుఫార్మ్ ఆహాలో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను క్లాక్ చేసినట్లు ఆహా ప్రకటించింది.


Next Story

Most Viewed