బాలీవుడ్ నటితో వడాపావ్ తిన్న యాపిల్ సీఈవో.. పిక్స్ వైరల్

by Disha Web Desk 10 |
బాలీవుడ్ నటితో వడాపావ్ తిన్న యాపిల్ సీఈవో.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా : యాపిల్ సీఈవో ‘టిమ్ కుక్‌’కు నటి మాధురీ దీక్షిత్ స్వాగతం పలికింది. సోమవారం ముంబైలో అడుగుపెట్టిన ఆయనతో కలిసి నగరంలో వడా పావ్‌ తింటూ ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మురిసిపోయింది. కంపెనీ విస్తరణలో భాగంగా ఇండియాకు వచ్చిన ఆయనకు ముంబై సాంప్రదాయ వంటకాలను రుచి చూపించిన నటి.. ‘ముంబైలో వడాపావ్‌కు మించిన వెల్‌కమ్ ఇంకోటి లేదు’ అని రాసుకొచ్చింది. అయితే దీనికి సమాధానంగా.. ‘నాకు మొట్టమొదటిసారి వడపావ్‌ని పరిచయం చేసినందుకు మాధురీ దీక్షిత్‌కి ధన్యవాదాలు. ఇది చాలా రుచికరమైనది’ అంటూ కుక్ థాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Also Read..

ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ పెళ్లి వీడియో.. ఫ్యాన్స్ ఎమోషనల్

Next Story