ఎట్టకేలకు సైలెన్స్ బ్రేక్ చేసిన అనుష్క శెట్టి.. అలాంటి ప్రకటన చేయడంతో అంతా షాక్!

by Mallepaka Hamsa |

ఎట్టకేలకు సైలెన్స్ బ్రేక్ చేసిన అనుష్క శెట్టి.. అలాంటి ప్రకటన చేయడంతో అంతా షాక్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గత ఏడాది ‘ఘాటీ’ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో కొన్నాళ్ల పాటు వార్తలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో ఆమె ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. వారం రోజులుగా తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి అనుష్క తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. పెళ్లి వార్తలపై మౌనంగానే ఉంటూ, తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘కథనార్’ (Kathanar) నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పెళ్లి పుకార్లకు చెక్ పెడుతూ అనుష్క తన సోషల్ మీడియాలో ఒక భయంకరమైన నీలిరంగు కన్ను ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు. "సైలెన్స్ బ్రేక్.. ఇంతకుముందెన్నడూ లేనంత బిగ్గరగా అప్‌డేట్ రాబోతుంది" అంటూ పవర్‌ఫుల్ క్యాప్షన్‌ను జత చేశారు. మార్చి 31న మధ్యాహ్నం 1:31 గంటలకు ‘కథనార్’ సినిమా నుంచి ఒక భారీ సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో అది చూసి కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు తెలివిగా పెళ్లి పుకార్లకు చెక్ పెట్టిందని అంటున్నారు.

ఇక విడుదలైన పోస్టర్ చూస్తుంటే అనుష్క మళ్ళీ ఒక హారర్ లేదా ఫాంటసీ థ్రిల్లర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక మలయాళ స్టార్ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. రోజిన్ థామస్ దర్శకత్వంలో, గోకులం గోపాలన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 9వ శతాబ్దం నాటి కాలానికి సంబంధించిన కథాంశంతో, మాంత్రిక శక్తులు, ఆధ్యాత్మిక రహస్యాలు, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ మూవీ రూపొందుతోంది. కేరళ జానపద గాథల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అనుష్క కెరీర్‌లో మరో ‘అరుంధతి’ రేంజ్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొత్తానికి పెళ్లి వార్తలతో కంగారు పడ్డ అభిమానులకు, అనుష్క తన సినిమా అప్‌డేట్‌తో అసలైన ట్రీట్ ఇచ్చారు. మార్చి 31న రాబోయే ఆ ‘బిగ్ అప్‌డేట్’ ఏంటో తెలుసుకోవాలని సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Next Story