ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క..! ఫ్యాన్స్‌కి ఇక పండుగే..

by Disha Web Desk 7 |
ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క..! ఫ్యాన్స్‌కి ఇక పండుగే..
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్క జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మొట్ట మొదటి సారి ‘బిల్లా’ సినిమాతో కలిసి నటించిన వీళ్లిద్దరూ.. తర్వాత ‘మిర్చి, బాహుబలి1, బాహుబలి2’ మూవీస్‌లో జంటగా నటించి ఆకట్టుకున్నారు. దీంతో స్క్రీన్‌పై వీళ్లిద్దరి క్రెమిస్ట్రీకి, పెయిర్‌కు అందరూ ఫిదా అయిపోయారు. అయితే.. బాహుబలి తర్వాత మళ్లి వీరి కాంబో రాలేదు. కానీ, వీళ్లిద్దరిని మళ్లీ కలిసి ఒకే తెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్, అనుష్క కలిసి ఓ సినిమా చెయ్యబోతున్నట్లు ప్రస్తుతం నెట్టింట ఓ వార్త హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. అంతే కాదు.. ప్రభాస్ చేస్తున్న సెట్‌లోకి అనుష్క సైతం ఎంట్రీ ఇచ్చిందట.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటికే చాలా మంది పాన్ ఇండియా స్టార్లు నటిస్తున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా.. మోహ‌న్ లాల్‌, న‌య‌న‌తార‌, కృతిస‌న‌న్‌, శివ‌రాజ్ కుమార్‌ కన్ఫర్మ్ కాగా.. ప్రభాస్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి అనుష్క రాబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో పార్వతిగా మొదట కంగానాను అనుకున్నారట. కానీ ఇప్పుడు అనుష్కను ఒకే చేశారట. అంతే కాదు పార్వతి పాత్ర చెయ్యడానికి అనుష్క సైతం ఒకే చెప్పిందని టాక్. కాగా.. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. మొత్తానికి ప్రభాస్, అనుష్క ఒకే ప్రాజెక్టులో చేస్తున్నారా అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More....

పైసా సంపాదన లేని వ్యక్తికి చెల్లినిచ్చి పెళ్లి చేసిన సల్మాన్.. పైగా అంతా మీరే చూసుకోవాలంటూ కండీషన్!



Next Story

Most Viewed