Vyooham : వ్యూహం నుంచి మరో ట్రైలర్ విడుదల..!!

by Disha Web Desk 9 |
Vyooham : వ్యూహం నుంచి మరో ట్రైలర్ విడుదల..!!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘వ్యూహం’. ఈ చిత్రం ఎన్నో అడ్డంకులను దాటుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఏకంగా తెలంగాణ హైకోర్టు ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేసింది. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంది. మొత్తానికి అన్ని అడ్డంకులను దాటుకుని ఫిబ్రవరి 23 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా మరో ట్రైలర్ విడుదలైంది. పలు రాజకీయ నాయకులను టార్గెట్ చేసి.. ఈ మూవీ తీసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ట్రైలర్ చూసినట్లైతే.. చంద్రబాబు పాము, మొసలి కంటే చాలా డేంజర్ అని ఓ డైలాగ్‌లో చెప్పించారు. ఇక సొంత ఏ నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేలా, మరో సీన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నారా లోకేష్ కోసం టీడీపీ(తెలుగుదేశం పార్టీ)ని చంద్రబాబు నాయుడు నాశనం చేశాడని చూపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా ప్రస్తుత ఏపీ సీఎం జగన్ వారి కుట్రలను అడ్డుకుని, జనాలకు మంచి చేస్తున్న వాడిగా ట్రైలర్‌లో చూపిస్తారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story