మరో వివాదంలో ‘Adipurush’ టీమ్.. నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేస్తే డబ్బులు ఇస్తామని ఆఫర్.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
మరో వివాదంలో ‘Adipurush’ టీమ్.. నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేస్తే డబ్బులు ఇస్తామని ఆఫర్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్’. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్‌గా విడుదలైంది. అయితే అది చూసిన నెటిజన్లు రామాయణాన్ని కార్టూన్ సినిమాలా మార్చేశారని పలు ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా డైరెక్టర్ ఓం రౌత్ కనిపిస్తే చంపేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగే రాముడిని మోడ్రనైజ్‌గా చూపించి అవమానించారని హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. ఈ మూవీ విడుదలై ఫస్ట్ షో నుంచి ఇలా ఎన్నో వివాదాలను ఎదుర్కొంటుంది.

తాజాగా, ఆదిపురుష్ మేకర్స్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ కలకలం సృష్టిస్తోంది. డాక్టర్ నిమో యాదవ్ అనే వ్యక్తికి ఆదిపురుష్ చిత్రంపై రివ్యూ నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేసి పాజిటివ్‌గా పెడితే ఒక్కో డబ్బులు ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అందులో ‘‘హలో డాక్టర్ నిమో యాదవ్ మీకు అర్జెంట్ రిక్వెస్ట్.. ఆదిపురుష్‌పై నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేసి పాజిటివ్‌గా పెట్టండి. ఒక్కో పోస్ట్‌కు రూ. 9500 ఇస్తాము. వెంటనే ఆ పని చేసి తెలియజేయండి డబ్బులు వస్తాయి అని ఉంది’’ అలాగే మరో నెటిజన్ రోషన్ రాయి అనే వ్యక్తికి అదిపురుష్‌పై నెగిటివ్’గా పెట్టిన పోస్టులు డిలీట్ చేస్తే రూ. 5500 ఇస్తామని చెప్పినట్టు ట్విట్టర్‌‌లో వారు పెట్టిన మేసే‌జ్ ను షేర్ చేశాడు. అంతేకాకుండా రూ. 500000 ఇచ్చిన అవి డిలీట్ చేయనని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: ఆ పార్ట్‌కు సర్జరీ చేసుకున్న ప్రభాస్.. అందుకే ఆదిపురుష్ ప్రమోషన్స్‌కి దూరమా?

Next Story

Most Viewed