యాంకర్ రూడ్ బిహేవియర్.. స్టేజ్‌పైనే ఏడ్చేసిన సింగర్

by Disha Web Desk 10 |
యాంకర్ రూడ్ బిహేవియర్.. స్టేజ్‌పైనే ఏడ్చేసిన సింగర్
X

దిశ, సినిమా : యాంకర్ రూడ్ బిహేవియర్‌తో పాపులర్ భోజ్‌పురి సింగర్ ప్రియాంక సింగ్ స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకుంది. బీహార్‌లో జరిగిన థావే మహోత్సవ్ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. సింగర్ మాట్లాడుతుండగానే మధ్యలోనే ఆపేందుకు ప్రయత్నించిన యాంకర్ రూపమ్ త్రివిక్రమ్.. రెండు నిమిషాలు మాట్లాడుతానని చెప్పినా కూడా వినిపించుకోకుండా మరొకరిని వేదిక మీదకు ఆహ్వానించేసింది. దీంతో ఏడ్చేసిన సింగర్.. కళాకారులకు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అని నిర్వాహకులపై ఫైర్ అయింది. ‘నేనేమీ కావాలని రాలేదు. పాడేందుకు చచ్చిపోవట్లేదు. మీరు పిలిస్తేనే వచ్చాను. కానీ అగౌరవపరిచారు. ఇది నిజంగా చేదు అనుభవం’ అని భావోద్వేగానికి లోనైంది.

Next Story

Most Viewed