ముస్లిం ఆచారంపై యాంకర్ రష్మి ట్వీట్.. ఆంటీ అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్స్

by Disha Web Desk 6 |
ముస్లిం ఆచారంపై యాంకర్ రష్మి ట్వీట్.. ఆంటీ అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ రష్మి జబర్దస్త్ షో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. సుధీర్, రష్మి ప్రేమించుకున్నారనే వార్తలు నిత్యం వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ అమ్మడుకి మంచి ఫాలోయింగ్ వచ్చింది. బుల్లితెర షోలతో పాటు పలు చిత్రాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. రష్మి జంతు ప్రేమికురాలని అందరికీ తెలిసిందే. నిత్యం పలు పోస్టులు పెడుతూ విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా, జూన్ 29న బక్రీద్ పండుగ సందర్భంగా రష్మి ముస్లిం ఆచారంపై మండిపడుతూ పోస్ట్ పెట్టింది. ‘‘హై టైమ్ ముస్లింలు ఇమేజ్ మేక్ఓవర్‌ను కలిగి ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా రక్తం, చేతులతో మాత్రమే ఉంటారు. కనికరం, ప్రేమ కోసం నిలబడే వారు ఒకే సమాజంలో చాలామంది ఉన్నప్పటికీ బుద్ధిమంతులు ముందుకు రావాలి’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు ‘పెద్ద పెద్ద కంపెనీలు నాన్ వెజ్ ను బ్రాండ్ క్రియేట్ చేసి అమ్ముతున్నారు, వాళ్లని ఎందుకు ప్రశ్నించవు’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరో నెటిజన్ రష్మీ ఆంటీ అంటూ ఆవు గడ్డి తింటున్న ఎమోజీని షేర్ చేశాడు. కొందరూ విమర్శింస్తుంటే మరికొంత మంది ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Also Read: బిగ్‌బాస్‌లో లిప్ లాక్ టాస్క్.. మైమరిచిపోయి 30 సెకండ్ల పాటు.. (వీడియో)

Next Story

Most Viewed