ప్రెస్ మీట్‌లో కన్నీళ్లు పెట్లుకున్న అనసూయ.. ఈ సారి ఏమైంది..?

by Disha Web Desk 9 |
ప్రెస్ మీట్‌లో కన్నీళ్లు పెట్లుకున్న అనసూయ.. ఈ సారి ఏమైంది..?
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రంగమార్తాండ’ చిత్రం ఈ రోజు(మార్చి22న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు ప్రకాష్, సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో స్టార్ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో నటించింది. అయితే తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో అనసూయ మాట్లాడుతూ.. ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయ్యారు. ‘నిన్న రివ్యూ చూశాను. సినిమా చాలా బాగుంది, నా జీవితానికి ఇది చాలు. రంగమార్తాండ లాంటి చిత్రంలో నేను ఉన్నాననేది నాకు చాలా సంతోషానిస్తోందని చెప్పుకొచ్చింది. ఇలా మాట్లాడుతూనే అందరిముందే కన్నీళ్లు పెట్టుకుని.. ఎమోషనల్ కామెంట్స్‌తో సినిమా గురించి చెప్పుకొచ్చింది. రంగస్థల నటీనటుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని మరాఠిలో తెరకెక్కిన సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ‘నటసామ్రాట్’ కు రీమేక్‌గా ఈ చిత్రం తెలుగులోకి వస్తోంది. ఇప్పటికే చిత్ర రివ్యూను చూసిన సెలబ్రెటీలు కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాని కొత్తగా ఆవిష్కరించిన చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీరెజ ముఖ్య పాత్రల్లో నటించారు.

Read more:

అలర్ట్ : ఆ వాహనాలను రోడ్లమీదికి తెస్తే.. స్క్రాప్ సెంటర్లకే!


Next Story

Most Viewed