- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే!
మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల వంటి సున్నితమైన, కఠినమైన సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన పవర్ఫుల్ కోర్ట్రూమ్ డ్రామా ‘అస్సి’ ఎట్టకేలకు డిజిటల్ తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా తీపి కబురు. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన ‘అస్సి’ చిత్రం మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల వంటి సున్నితమైన, కఠినమైన సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలో తాప్సీ ఒక ధైర్యవంతురాలైన న్యాయవాదిగా నటించి, తన అద్భుతమైన నటనతో అందరినీ కంటతడి పెట్టించింది. అలాగే మలయాళ నటి కని కుస్రుతి అత్యాచార బాధితురాలిగా కనిపించి ఆకట్టుకున్నారు. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమా విమర్శకుల నుంచి సెలబ్రిటీల నుంచి భారీ ప్రశంసలు అందుకుంది.
థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే, ప్రస్తుతానికి కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. సౌత్ భాషల వెర్షన్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. పెళ్లి తర్వాత తాప్సీ తన సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. భారీ కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యత ఇస్తోంది. ‘అస్సి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆమె క్రేజ్ మళ్లీ పెరిగింది. సామాజిక బాధ్యత గల కథాంశంతో వచ్చిన ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






