'పుష్ప 2' రిలీజ్‌పై వీడని ఉత్కంఠ.. నెట్టింట నెటిజన్ల రచ్చ

by Disha Web Desk 7 |
పుష్ప 2 రిలీజ్‌పై వీడని ఉత్కంఠ.. నెట్టింట నెటిజన్ల రచ్చ
X

దిశ, సినిమా: అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప 2' గురించి మరో అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న పాన్ ఇండియా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాన్ని 2023 సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని అభిమానులు భావించినప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడింది.

ఇక తర్వాత 2023లోనే వేసవి కానుకగా తీసుకొస్తారంటూ పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ సినిమానుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే పలు నివేదికల ప్రకారం ఈ సమ్మర్‌లోనే పక్కా రిలీజ్ ఉంటుందని తెలుస్తుండగా.. వేసవి సెలవుల్లో అభిమానులకు పూనకాలేనంటున్నారు నెటిజన్లు. ఇక మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read..

బ్రేకింగ్: సినీ నటుడు నరేష్ ఇంటిపై దాడి

Next Story

Most Viewed