- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Shruti Haasan : ముఫ్పై ఏళ్లు దాటినా ఆ సోయి లేదని ఎగతాళి చేశారు.
దిశ, సినిమా: వయసు పెరుగుతున్నకొద్ది తన జీవితంలో చోటుచేసుకున్న మార్పుల గురించి శృతిహాసన్ ఓపెన్ అయింది. ఈమేరకు ముప్ఫై ఏళ్లు దాటిన తర్వాత తనలో చాలా పరిపక్వత పెరిగిందని, అందుకే ప్రశాంతంగా ఉండగలుగుతున్నానంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘నాకు ఇప్పుడు చాలా హాయిగా ఉంది. మనసు బాగుంటేనే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. కొంతకాలంగా నా మ్యారేజ్ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నాను. 30 ఏళ్లు దాటాయని గుర్తుచేసి మరి ఎగతాళి చేశారు. చాలా ఒత్తిడికి లోనయ్యేదాన్ని. నా పెళ్లి గురించి నాకంటే వాళ్లే ఎక్కవ బాధపడుతున్నారు. నిజానికి ఈ వయసు దాటేలోపు పెళ్లి చేసుకోకపోవడం నేరమా? దానివల్ల దేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందా?’ అంటూ ప్రశ్నించింది. ఇక ఏదిఏమైనా పెళ్లిపై ఎలాంటి బెంగ పెట్టుకోకుండా ఇప్పటికైతే హాయిగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పిన శృతి.. నెటిజన్ల మాటలు పట్టించుకోకపోవడమే లైఫ్లో చేసిన అతిపెద్ద మంచి పని అంటూ ట్రోలర్స్కు చురకలంటించింది.
- Tags
- Shruti Haasan