కశ్మీర్‌లో 32 ఏళ్ల తర్వాత హౌస్‌ఫుల్ అయిన థియేటర్!

by Disha Web Desk 19 |
కశ్మీర్‌లో 32 ఏళ్ల తర్వాత హౌస్‌ఫుల్ అయిన థియేటర్!
X

దిశ, సినిమా: షారుఖ్ ఖాన్ నాలుగు సంవత్సరాల విరామం తర్వాత 'పఠాన్' చిత్రంతో వచ్చి భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ కొల్లగొడుతున్నాడు. భారతదేశంలో ఒకే రోజు రూ. 68 కోట్లు రాబట్టిన తొలి హిందీ చిత్రం 'పఠాన్' చరిత్ర సృష్టించిందని విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఇక మొత్తానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 219.6 కోట్లకు చేరుకుందని యశ్ రాజ్ ఫిల్మ్స్ తెలిపింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీతో కాశ్మీర్ థియేటర్లలో పూర్వ వైభవం వచ్చింది. 32 ఏళ్లలో తొలిసారిగా థియేటర్ హౌస్‌ఫుల్ అయిందని కశ్మీర్‌లోని ఓ థియేటర్ యజమాని తెలిపారు. 'ఈరోజు 'పఠాన్' మూవీతో మా హాల్ హౌస్‌ఫుల్ చేసినందుకు కింగ్ ఖాన్‌కు కృతజ్ఞతలు' అని ట్విట్ చేశారు.

READ MORE

అవును.. నా కొడుకుతో కొన్ని గొడవలున్నాయి: స్టార్ హీరో తండ్రి



Next Story

Most Viewed