నటుడిగా పన్నెండేళ్లు పూర్తిచేసుకున్న ఆది సాయికుమార్

by Disha Web Desk 13 |
నటుడిగా పన్నెండేళ్లు పూర్తిచేసుకున్న ఆది సాయికుమార్
X

దిశ, సినిమా: సీనియర్ హీరో సాయికుమార్ కొడుకు హీరో ఆదిసాయికుమార్ ‘ప్రేమ కావాలి’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు హీరోగా పరిచమయ్యాడు. అయితే అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆది.. నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టి ఈ ఫిబ్రవరి 26కు పన్నెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. తాజాగా ‘పులి మేక’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌ ‘జీ5’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తన పన్నెండేళ్ల కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేస్తున్న ఆది సాయికుమార్.. మరిన్ని మంచి చిత్రాలు ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నాన్ని మాత్రం ఆపట్లేదు. త్వరలోనే తన కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించనున్నాడు.

Next Story

Most Viewed