- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సడెన్ షాకిచ్చిన హీరోయిన్.. దేవుడు ఇచ్చిన అద్భుతమైన కానుక అంటూ ఎమోషనల్ పోస్ట్
మేము ఇద్దరం కాస్తా ఇప్పుడు ముగ్గురం కాబోతున్నాం.. హల్లెలూయ" అంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

దిశ, సినిమా: ‘సామజవరగమన’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సరస్వతి’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న నటి రెబ్బా మోనికా జాన్. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అందరినీ మెప్పించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతమైన వార్తను పంచుకున్నారు. ఆమె త్వరలోనే తల్లి కాబోతున్నాననే తీపి కబురును తన అభిమానులకు తెలియజేసి షాకిచ్చింది. ప్రస్తుతం రెబ్బా తన భర్త జోమెన్ జోసెఫ్తో కలిసి థాయ్లాండ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి పుకెట్ రిసార్ట్ లొకేషన్లలో బేబీ బంప్తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. "మేము ఇద్దరం కాస్తా ఇప్పుడు ముగ్గురం కాబోతున్నాం.. హల్లెలూయ" అంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. భర్తతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఆ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా.. రెబ్బా తన చిరకాల మిత్రుడు జోమెన్ జోసెఫ్ను 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత కూడా తన సినీ కెరీర్ను ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నారు. విజయ్ సరసన ‘బిగిల్’లో యాసిడ్ విక్టిమ్గా నటించి మెప్పించిన ఆమె, ఇటీవల రజనీకాంత్ సరసన ‘కూలీ’ వంటి భారీ చిత్రంలో కూడా నటించి బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ, మాతృత్వానికి సిద్ధమవుతూ తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నారు. ఈ కొత్త ప్రయాణం గురించి రెబ్బా ఎమోషనల్ అవుతూ.. "దేవుడు మాకు ప్రసాదించిన ఈ అద్భుతమైన కానుక పట్ల మేము ఎంతో కృతజ్ఞతతో ఉన్నాము. మా చుట్టూ ఇప్పుడు కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ అందరి ఆశీస్సులు మాకు ఎంతో ముఖ్యం" అని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు. రెబ్బా ప్రెగ్నెన్సీ వార్త విన్న అభిమానులు, తోటి సినీ సెలబ్రిటీలు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






