స్త్రీలను రాక్షసుల్లా పీక్కుతింటున్నారు.. ఇండస్ర్టీపై నటి షాకింగ్ కామెంట్స్

by Dishanational2 |
స్త్రీలను రాక్షసుల్లా పీక్కుతింటున్నారు.. ఇండస్ర్టీపై నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్‌ కౌర్‌ మరోసారి మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇండస్ర్టీలో తనపై చూపించిన వివక్షను తట్టుకోలేక దేశం విడిచి వెళ్లిపోదామనుకున్నానంటూ భావోద్వేగానికి లోనైంది. తను నటించిన తాజా చిత్రం 'నాతిచరామి' సినిమా ప్రచారంలో భాగంగా ప్రముఖ చానెల్‌తో మాట్లాడిన ఆమె.. 'నాపై చేస్తున్న కుట్రలను చూడలేక నా తల్లి తల్లడిల్లిపోయింది. ఆమె బాధ చూడలేక సినిమాలు వొదిలేసి పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోదామనుకున్నా. కానీ, క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ రియలైజ్‌ అయ్యాను. ఒక్క సినిమాతో నేనేంటో నిరూపించుకోవాలని ధైర్యంగా ముందుకు సాగాను. ప్రతిరోజూ లేవగానే సీత, దుర్గా, ద్రౌపదిలానే నన్ను నేను భావించుకుని శక్తిని పొందాను' అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే దుర్భరమైన పరిస్థితిలో ఉన్న మహిళలపై కన్నువేసిన కొంతమంది పురుషులు రాక్షసుల్లా పీక్కుతింటారని చెప్పిన పూనమ్.. అలాంటి వాళ్ల కారణంగా ఎన్నో పెద్ద ప్రాజెక్టులను వదులుకున్నట్లు చెప్పింది. ఇక చివరగా కొందరు పెద్దలు తనను అడ్డుగా పెట్టుకుని ఎన్నో దుర్మార్గాలకు పాల్పడ్డారని, అలాంటి వారందరికీ కాలమే సమాధానం చెబుతుందని తెలిపింది.


యోగా టిప్.. సర్వాంగాసనం వేయడం ఎలా?

Next Story

Most Viewed