అలాంటి వారిని నిర్లక్ష్యం చేయకంటూ నటి హరితేజ పోస్ట్.. నెట్టింట మొదలైన చర్చలు

by Disha Web Desk 6 |
అలాంటి వారిని నిర్లక్ష్యం చేయకంటూ నటి హరితేజ పోస్ట్.. నెట్టింట మొదలైన చర్చలు
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి హరితేజకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు సీరియల్స్‌తో పాటు బిగ్‌బాస్‌ షోలో పాల్గొన ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించి మెప్పించింది. ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చి సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో దగ్గరగా ఉంటుంది. జీరో సైజు లోకి మారింది. మొన్నటి వరకు హరితేజ ఫారిన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేసింది. ఆస్ట్రేలియాలో వెకేషన్ ఫొటోలను షేర్ చేసి తన అభిమానులను అలరిస్తూ వచ్చింది.

తాజాగా, హరితేజ తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘ నువ్వు ఎక్కడున్నావు.. ఎలా ఉన్నావు. ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లావా అని అడిగే గొంతుని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకు. ముఖ్యంగా తల్లిదండ్రులను. చెప్పాలనిపించింది’’ అంటూ రాసుకొచ్చింది. అయితే అది చూసిన నెటిజన్లు హరితేజ అసలు ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టింది ఏమంది? అని నెట్టింట చర్చలు మొదలెట్టారు. ప్రస్తుతం హరితేజ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి : అల్లు అర్జున్‌కు స్పెషల్ సర్‌ప్రైజింగ్ ఇచ్చిన స్నేహా రెడ్డి తండ్రి



Next Story

Most Viewed