పేరెంట్స్, పెద్దలు చెప్పేదంతా అబద్ధమే.. కానీ ఆ ఒక్కటి నమ్మాలంటున్న స్వాతి

by Disha Web Desk 10 |
పేరెంట్స్, పెద్దలు చెప్పేదంతా అబద్ధమే.. కానీ ఆ ఒక్కటి నమ్మాలంటున్న స్వాతి
X

దిశ, సినిమా: మనిషి జీవితం ఎప్పుడూ ఊహించినదానికి భిన్నంగానే ఉంటుందని చెబుతోంది కలర్స్ స్వాతి. నవీన్ చంద్ర సరసన ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘మంత్ ఆఫ్ మధు’ అక్టోబర్ 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమెషన్స్ నిర్వహిస్తున్న స్వాతి రీసెంట్‌ ఇంటర్వ్యూలో కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ‘మనకు చిన్నప్పటినుంచి పేరెంట్స్, ఫ్రెండ్స్, పెద్దలు ఏవేవో చెబుతుంటారు. మనం కూడా చాలా నమ్ముతాం. కానీ రియల్ లైఫ్ మాత్రం టోటల్ అపోజిట్‌గా ఉంటుంది. మాకు తెలిసిన అలాంటి ఓ నిజాన్ని ఈ మూవీలో చెప్పాలనుకున్నాం. ఇందులో చెప్పిన నిజం ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. అలాగే ఇది హీరోయిన్‌ను హైలెట్ చేసే చిత్రం కాదు. అలాగని నా అభిమానులను డిజప్పాయింట్ చేయదు. మేము రుజువు చేసే నిజం అందరికీ ధైర్యాన్నిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే వాస్తవికతతో కూడిన ఈ మూవీలో సహజమైన లోకేషన్లు, సంగీతం, చిత్రీకరణ అందరినీ అట్రాక్ట్ చేస్తాయన్న నటి.. తాను ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాపై మరింత ఆసక్తి పెరిగిందని దర్శకుడు శ్రీకాంత్ చెప్పడం హ్యాపీగా అనిపించిందని తెలిపింది.


Next Story